ట్రంప్ విందుకు జగన్ ను ఎందుకు పిలవలేదో తెలుసా?..బిత్తరపోయే జవాబిచ్చిన బొత్స

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (07:47 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాక నేపథ్యంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్​కు ఆహ్వానం అందకపోవటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 

ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సీఎం జగన్ దేశంలో బలమైన నాయకుడు కాబట్టే విందుకు ఆహ్వానించలేదని అన్నారు.

నవీన్​ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని గుర్తు చేశారు. విశాఖలో బలవంతంగా భూసేకరణ చేయడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అలాగే ఏం చేశారని విజయనగరం జిల్లాలో పర్యటిస్తారో చంద్రబాబు చెప్పాలని విమర్శించారు. జిల్లాలో చైతన్య యాత్ర పేరిట యాత్రలు చేసే ముందు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

విశాఖలో భూసేకరణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరి నుంచీ భూమిని సేకరించేది లేదని చెప్పారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే భూసమీకరణ చేయాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments