Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్రబాబు జైలుకెళ్లడం తథ్యం : బొత్స జోస్యం

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం తథ్యమని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగడం లేదని, కేవలం రాజకీయ వ్యాపారమే సాగుతోందని విమర్శించారు. 
 
ముఖ్యంగా.. జపాన్, సింగపూర్‌ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడారో పరిశీలిస్తే, అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని, అప్పుడు ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు గతంలోనే వచ్చాయని, వాటిపై విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఏపీ రాజధాని నిర్మాణంలో ఏమాత్రం పారదర్శకత లేదని విమర్శించారు. చంద్రబాబుపై విచారణ చేపట్టాలని... అప్పుడు ఆయన చేసిన దందాలు, వ్యాపారాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. భూముల సేకరణ విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని బొత్స చెప్పుకొచ్చారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments