Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు... ప్రయాణికుల పరుగో పరుగు...

Webdunia
సోమవారం, 4 మే 2015 (13:29 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆకతాయి చేసిన ఫోన్‌కాల్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. మూడు గంటలపాటు రైల్వే పోలీసులు  తనిఖీ నిర్వహించి ఉత్తిదేనని నిర్ధారించారు. 
 
వివరాలు... రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టామని, అది ఉదయం 11 గంటలకు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై పేలుతుందని ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోల్‌రూమ్ అధికారులు అప్రమత్తం చేయడంతో వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అన్ని ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల లగేజీ, విశ్రాంతి గదులు, పార్కింగ్ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. తీరా తనిఖీలు ముగిశాక అది ఆకతాయి ఫోన్‌కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. శంకర్‌పల్లికి చెందిన బాలయ్య అనే వ్యక్తికి చెందిన సిమ్‌కార్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తించారు. పోలీసులను ఆటపట్టించిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments