Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో 'దేవర' హీరోయిన్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (16:14 IST)
Jhanvi Kapoor
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం ఆమె లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా తిరుమలకు వచ్చారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ... ఈ దఫా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. గతంలో ఆమె అలిపిరి నడక మార్గంలో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
Jhanvi Kapoor
 
కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న "దేవర" చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనానికి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments