Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - భాజపా అధ్యక్షుడు అమిత్ భేటీ

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (22:31 IST)
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం అవుతున్నట్లు సమాచారం. అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా హోటల్ హరితలో పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వీరిద్దరి భేటీలో విశాఖ ఎంపీ హరిబాబు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. 
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం అమిత్ ఆయనను కలుస్తున్నట్లు సమాచారం. కాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రచార సభలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేసి ఆ రెండు పార్టీల గెలుపుకు పాటుపడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పవన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments