Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాచరిక జమానా కాదు... కేంద్రం చూస్తోంది : సుజనా చౌదరి

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (17:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాచరిక జమానాలో లేదని ప్రజాస్వామ్య దేశంలోనే ఉందనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై ఆయన స్పందించారు. 
 
ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందన్నారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 
 
'ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. సామాజికవర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
అయితే, ఈ చర్యలన్నింటినీ కేంద్రం గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300 కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments