Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు పనీపాటా లేదా : ప్రత్యేక హోదాపై కామెంట్స్ చేసే వారిపై జీవీఎల్ సెటైర్లు

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (09:12 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి పనీపాట లేదా.. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సరైన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ నిర్ణయాన్ని కోట్లాది మంది భారతీయులు స్వాగతిస్తున్నారన్నారు. పైగా, కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది ఒక్క బీజేపీ మాత్రమేనన్న విషయం ఆర్టికల్ 370 రద్దుతో నిరూపితమైందన్నారు. 
 
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఏపీకి ప్రత్యేకహోదా, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశాలపైనా స్పందించారు. ప్రత్యేకహోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతుంటారని, కాలక్షేపం కోసం ప్రత్యేకహోదా అనడం అలవాటైపోయిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా సమయం ఉందని, దీనిపై నరేంద్ర మోడీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments