Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు పనీపాటా లేదా : ప్రత్యేక హోదాపై కామెంట్స్ చేసే వారిపై జీవీఎల్ సెటైర్లు

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (09:12 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి పనీపాట లేదా.. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సరైన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ నిర్ణయాన్ని కోట్లాది మంది భారతీయులు స్వాగతిస్తున్నారన్నారు. పైగా, కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది ఒక్క బీజేపీ మాత్రమేనన్న విషయం ఆర్టికల్ 370 రద్దుతో నిరూపితమైందన్నారు. 
 
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఏపీకి ప్రత్యేకహోదా, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశాలపైనా స్పందించారు. ప్రత్యేకహోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతుంటారని, కాలక్షేపం కోసం ప్రత్యేకహోదా అనడం అలవాటైపోయిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా సమయం ఉందని, దీనిపై నరేంద్ర మోడీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments