Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో సాధినేని యామినిని ఇరికించారా? పోలీసు స్టేషన్‌లో?

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (16:45 IST)
ఎపి బిజెపి నేత సాధినేని యామినిపై పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయోధ్య రామాయల నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టిటిడిపై సాధినేని యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టిటిడి విజిలెన్స్ విభాగం తిరుమల టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపిసీ సెక్షన్ 505(2), 500 కింద కేసులు నమోదు చేశారు. 2019 సంవత్సరం ఎన్నికలకు ముందు వరకు పార్టీ అధికార ప్రతినిధిగా టిడిపిలో యాక్టివ్ రోల్ పోషించారు సాధినేని యామిని. 
 
ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తరువాత కాలంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా తాజా రాజకీయ పరిణామాలతో హాట్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు యామిని.
 
అయితే బిజెపి నేతపై కేసు పెట్టడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. బిజెపి నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది అయోధ్య భూమిపూజకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. వారందరినీ వదిలేసి యామినిపై కేసులు పెట్టడానికి ఆమె గతంలో తెలుగుదేశంలో ఉండటమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
టిడిపి నుంచి బిజెపిలోకి యామిని రావడం.. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఆమె పైన కేసులు పెట్టినట్లు ప్రచారం బాగానే సాగుతోంది. కేసు పెట్టిన తరువాత యామిని ఖచ్చితంగా పోలీసు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments