Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు నిజాలు.. మాకు అబద్ధాలు చెప్పడం రాదు : కన్నా లక్ష్మీనారాయణ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజాలు, మాకు అబద్ధాలు చెప్పడం రాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (16:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజాలు, మాకు అబద్ధాలు చెప్పడం రాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందేనని అన్నారు.
 
పోలవరంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. అందుకే చంద్రబాబుకు నిజం మాట్లాడటం, తమకు అబద్ధాలు చెప్పడం చేతకాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో తెలుగుదేశం, వైసీపీ కుమ్మక్కై సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన వరం పోలవరం ప్రాజెక్టు అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆంధ్రా ప్రజల దీర్ఘకాలిక స్వప్నం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పోలవరం జీవనాడి అనే విషయం ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments