వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట..30 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:27 IST)
వైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్‌ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం ఈ  దాడి నిర్వహించారు.

తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్‌రెడ్డి ఇంట్లో పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్‌ఈబీ సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల నగదు, మూడు కార్లు, మూడు మో టార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు.

పట్టుబడినవారిలో కడప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వ చ్చిన వారున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

పేకాటలో డబ్బుకు బదులుగా టోకెన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని, టోకెన్ల విలువను బట్టి గెలిచినవారికి డబ్బు చెల్లిస్తున్నారని సీఐ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments