Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాకిచ్చిన అవంతి శ్రీనివాస్ : నువ్వు ఉంటే ఎంతా.. పోతే ఎంత? బాబు ఫైర్

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:36 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తేరుకోలేని షాకిచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీతో పాటు.. తన లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన నేరుగా జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి వైకాపాలో చేరిపోయారు. 
 
ఈ పరిణామంపై సీఎం చంద్రబాబు స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారన్నారు. ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు వెళ్లిపోయారని చెప్పారు. 'నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా' అని ప్రజనుద్దేశించి ప్రశ్నించారు. 'నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా' అని అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. 
 
కాగా, నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24 గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments