Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు షాక్...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (16:44 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
జర్మనీ పౌరుడుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 యేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ నష్టపరిహారాన్ని నెల లోపు చెల్లించాలని ఆదేసించింది. 
 
ఈ మొత్తంలో రూ.25 లక్షలు నగదును ప్రస్తుత ప్రభుత్వ విప్‌గా, వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్‌కు, రూ.5 లక్షలను లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస గతంలో చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments