Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు షాక్...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (16:44 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
జర్మనీ పౌరుడుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 యేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ నష్టపరిహారాన్ని నెల లోపు చెల్లించాలని ఆదేసించింది. 
 
ఈ మొత్తంలో రూ.25 లక్షలు నగదును ప్రస్తుత ప్రభుత్వ విప్‌గా, వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్‌కు, రూ.5 లక్షలను లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస గతంలో చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments