మరో రెండు రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు.. జోరుగా ఊహాగానాలు
తుని సంఘటనలో తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
తుని సంఘటనలో తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తుని సంఘటనలో ప్రధాన సూత్రధారిగా భూమన వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
దీంతో ప్రభుత్వం నిందితుల కోసం సిఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ విచారణలో కరుణాకర్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేయగా అందులో నిజాలు బయటపడ్డాయి. దీంతో నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
రెండురోజుల పాటు భూమనను విచారించిన విషయం తెలిసిందే. రెండవరోజు 8 గంటలసేపుకు పైగా భూమనను విచారించిన సీఐడీ ఒకానొకదశలో ఆయన్ను అరెస్టు చేస్తారని భావించారు. అయితే భూమనను అప్పట్లో వదిలిపెట్టారు కానీ మరో రెండురోజుల్లో విడుదల చేస్తారని తెలుస్తోంది.