Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఊళ్ళోకి వచ్చారో... మర్యాద ఉండదు.. అధికారులకు భోగాపురం గ్రామస్తుల హెచ్చరిక

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (08:01 IST)
అనుమతుల్లేకుండా మా భూముల్లో సరిహద్దులు.. రాళ్లు నాటడానికి మీరెవరు..? సర్వేలంటూ మా గ్రామాల్లోకి అడుగు పెడితే మర్యాద దక్కదంటే అంటూ భోగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికార బృందంపై విరుచుకుపడ్డారు. వాహనాలను అడ్డుకున్నారు. పాతిన నంబర్ రాళ్ళను తొలగించేశారు. ఆ ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే అదే సమయంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైట్స్‌ సంస్థకు చెందిన కేంద్ర బృందం సభ్యులు రాజులమెట్ట, తూడెం, రావాడ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్‌పోర్టు సరిహద్దులు గుర్తించి సర్వే రాళ్లు పాతారు. రావాడ గ్రామంలో సర్వే నిర్వహిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. 
 
అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు పాతిన రాళ్లను వారు తొలగించారు. అధికారులు వాహనశ్రేణిని అడ్డుకున్నారు. వాహనాల ముందు పడుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన రైతులలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 
రావాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది రైతులు, మహిళలు కలిసి భోగాపురం పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఒక దశలో మహిళలు పోలీసు స్టేషన్‌ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టడంతో వెళ్లిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

Show comments