Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైటెక్ దోపిడీ.. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి..

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:14 IST)
దోపిడీ దొంగలు రూటు మార్చారు, ఎప్పుడూ ఒకే విధంగా దొంగతనాలు చేసి విసిగిపోయి కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. ఇప్పుడు రోడ్డు పక్కన అందమైన అమ్మాయిలను ఎరగా వేసి దోపిడీలు చేస్తున్నారు. వాహనదారులను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు ఈ ఉపాయాన్ని ఆలోచించారు.
 
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడలో రాత్రి వేళల్లో దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రోడ్డు పక్కన ఒక మహిళను నిలబెట్టి అటుగా వచ్చే వాహనాన్ని లిఫ్ట్ అడిగినట్లు నటిస్తారు. పొరపాటున ఎవరైనా బండి ఆపితే అయిపోయినట్లే, ఆ చుట్టుపక్కల కాపు కాసి ఉన్న దొంగలు ఒక్కసారిగా వాహనదారుల మీద దాడి చేస్తారు. ఆ తర్వాత వారి వద్ద ఎంత ఉంటే అంతా దోచుకుంటారు. ఒకవేళ వారికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికైనా వెనుకాడటం లేదు.
 
తాజాగా ఒక లారీని ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్‌ని చితకబాది వారి వద్ద ఉన్న 10 వేలు లాక్కొని వెంటనే అటుగా వస్తున్న మరో కారును ఆపే ప్రయత్నం చేయగా కారు నడిపే వ్యక్తి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దోపిడీ చాలా కాలంగా జరుగుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments