Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేకు వెయ్యి ఆవులు ఇస్తాం.. సొంతంగా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (10:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి సొంతంగా పాల డెయిరీ ఎందుకు ఉండరాదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. తమ పార్టీ తరపున వెయ్యి ఆవులు ఇస్తామని అందువల్ల తితిదే సొంతంగా డెయిరీ పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. 
 
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ లేఖ రాయడం గమనార్హం. అలాగే, తితిదేకు వెయ్యి ఆవులు ఇస్తామని కీలక ప్రకటన చేయడం గమనార్హం. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 
 
తితిదేకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు రెడీగా ఉంటే తాను వెయ్యి ఆవుల్ని ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, మరో లక్ష గోవుల్ని ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకుంటానని చెప్పారు. లక్ష ఆవుల నుంచి రోజుకు పది లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అయినా దాదాపు 50 వేల కేజీల వెన్న వస్తుందని, దాని నుంచి సుమారు 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. 
 
ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప నైవేద్యాలు, లడ్డూ తయారీ కోసం ఉపయోగించవచ్చని, మిగతా నెయ్యిని ఇతర ఆలయాలకు కూడా సరఫరా చేయవచ్చని తెలిపారు. ఇలా చేస్తే నెయ్యి కల్తీ జరగకుండా ఉంటుందని అభిప్రాయడ్డారు. అలాగే, టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments