Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే.. : బాబు మోహన్

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (16:40 IST)
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైతే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. బుధవారం విశాఖపట్టణంలో బాబు మోహన్ విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి బీజేపీ తనను మోసం చేసిందని చెప్పారు. అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యాయని చెప్పారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. ఆయన ఆహ్వానం మేరకే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు చెప్పారు. వైజాగ్ ఎంపీ‌గా కేఏ పాల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎంపికైతే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఆయన ఎంపీ అయితే, ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చి రాష్ట్ర దేశ అప్పులు తీర్చుతారని చెప్పారు. పైగా, ఆయన దేవుని దూత అని చెప్పాు. అందువల్ల కేఏ పాల్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments