Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే.. : బాబు మోహన్

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (16:40 IST)
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైతే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. బుధవారం విశాఖపట్టణంలో బాబు మోహన్ విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి బీజేపీ తనను మోసం చేసిందని చెప్పారు. అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యాయని చెప్పారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. ఆయన ఆహ్వానం మేరకే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు చెప్పారు. వైజాగ్ ఎంపీ‌గా కేఏ పాల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. పాల్ లోక్‌సభ సభ్యుడిగా ఎంపికైతే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఆయన ఎంపీ అయితే, ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చి రాష్ట్ర దేశ అప్పులు తీర్చుతారని చెప్పారు. పైగా, ఆయన దేవుని దూత అని చెప్పాు. అందువల్ల కేఏ పాల్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments