సెల్ఫీ పిచ్చి.. గూడ్స్ రైలెక్కి సరదా కోసం సెల్ఫీ తీసుకున్నాడు.. వైర్లు తెగడంతో?
సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. తాజాగా విశాఖ జిల్లా అరకులో
సోషల్ మీడియా, ఐఫోన్ల ప్రభావంతో యువతకు సెల్ఫీలపై పిచ్చి ఎక్కువైంది. సెల్ఫీల కోసం నేటి యువత ఎలాంటి సాహసానికైనా వెనుకాడట్లేదు. అయితే ఇలాంటి సాహసాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. తాజాగా విశాఖ జిల్లా అరకులో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. జాన్ అనే బీటెక్ విద్యార్థి గూడ్స్ రైలు ఎక్కి సరదా కోసం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
ఫోటో దిగే క్రమంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లు తగలడంతో జాన్కు తీవ్ర గాయాలైనాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. పండుగ సెలవుల నేపథ్యంలో స్నేహితులతో కలసి అరకు వెళ్లాడు. సోమవారం ఉదయం అరకు రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంటుంది.