Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక ప్రతి ఏడాది వాహనం బీమా ప్రీమియం

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:38 IST)
ఏపీలో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు బీమా ప్రీమియంను ఇక నుంచి ఏ ఏటికాయేడు చెల్లించవచ్చు. ఇప్పటివరకు ఉన్న మూడేళ్లు, ఐదేళ్లకు ఒక్కసారే ప్రీమియం చెల్లించాలనే నిబంధన నుంచి రాష్ట్రంలోని కొనుగోలుదారులకు ఉపశమనం కలగనుంది. 
 
ప్రస్తుతం ఎవరైనా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే తొలి ఏడాది పూర్తి స్థాయి బీమా, మిగిలిన నాలుగేళ్లకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్నారు. 
 
కార్లకు తొలి ఏడాది పూర్తి బీమాతోపాటు మరో రెండేళ్లకు థర్డ్‌ పార్టీ ప్రీమియం కట్టించుకుంటున్నారు. అయితే ఇలా ముందుగానే ప్రీమియం తీసుకోకూడదని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలో త్వరలో ఈ విధానం అమలు కానుంది. దీనివల్ల కొనుగోలుదారులపై ఒకేసారి భారం పడే ఇబ్బంది తగ్గనుంది. రాష్ట్రంలో రవాణాశాఖకు చెందిన చెక్‌ పోస్టులను తొలగించే అంశం పరిశీలనలో ఉంది. 
 
సరిహద్దుల్లో రాష్ట్రంలోకి రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఈ చెక్‌పోస్టులున్నాయి. జీఎస్టీ అమలు చేస్తుండటం, కేంద్రానికి చెందిన వాహన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాహనాల వివరాలు అందుబాటులో ఉంటున్నందున రాష్ట్రాల్లో చెక్‌ పోస్టుల అవసరం లేదని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఒడిశాలో వీటిని తొలగించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments