Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రస్థాయిలో నీటికొరత : హెలికాఫ్టర్లలో వెళ్లి ఒంటెలను చంపేస్తున్నారు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (17:29 IST)
ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనికి కారణం ఒంటెలు అధికంగా నీళ్లు తాగేస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒంటెలను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ దేశ అధికారులు హెలికాఫ్టర్లలో గాలిస్తూ కంటికి కనిపించిన ఒంటెను చంపేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే, కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాపర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments