Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడగవిప్పిన ఫ్యాక్షనిజం: వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (12:33 IST)
అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పింది. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో వైఎస్సార్సీపీ కార్యకర్త రంగయ్యనాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
రంగయ్యనాయుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్యనాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
మరోవైపు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడిచేశారు. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో వైసీపీ కార్యకర్త నాగిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. శత్రువులు గొడ్డళ్లతో నరకడంతో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments