Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు బైపోల్ : గెలుపు దిశగా వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (12:38 IST)
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. వైకాపా తరపున ఉప ఎన్నిక బరిలో నిలిచిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా వెళ్తున్నారు. 
 
12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2.13 లక్షల మంది ఓటర్లు ఉండగా, 1.37 లక్షల మంది ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓట్లు వేశారు. 
 
12వ రౌండ్ (12 రౌండ్లు కలిపి) పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డికి 61,829, భాజపా అభ్యర్థి భరత్ కుమార్‌కు 11,175, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 3,405, నోటాకు 2,598 ఓట్లు వచ్చాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్‌పై 50,654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments