Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి వస్తుందనే జగన్ కుంటిసాకు : అచ్చెన్నాయుడు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:52 IST)
కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరుకావాల్సివుంది. కానీ, కాలు బెణికుందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పైపెచ్చు. గురువారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, లింగంగుంట్లలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి సీఎం జగన్ హాయిగా పాల్గొన్నారు. దీన్ని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. 
 
సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని స్పష్టంచేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కళ్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా అని నిలదీశారు. ఇటీవల వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి వెళ్లకుండా చిలకలూరిపేటకు ఎలా వెళతారని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments