Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి వస్తుందనే జగన్ కుంటిసాకు : అచ్చెన్నాయుడు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:52 IST)
కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరుకావాల్సివుంది. కానీ, కాలు బెణికుందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పైపెచ్చు. గురువారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, లింగంగుంట్లలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి సీఎం జగన్ హాయిగా పాల్గొన్నారు. దీన్ని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. 
 
సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని స్పష్టంచేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కళ్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా అని నిలదీశారు. ఇటీవల వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి వెళ్లకుండా చిలకలూరిపేటకు ఎలా వెళతారని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments