కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీపై వ్యతిరేకతే.. ఏపీలోనూ రిపీట్ : అచ్చెన్నాయుడు

Webdunia
సోమవారం, 15 మే 2023 (13:44 IST)
ఇటీవల కర్నాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. అధికార బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఫలితాలపై ఏపీ రాష్ట్ర శాఖ టీడీపీ అధినేత కె.అచ్చెన్నాయుడు స్పందిస్తూ, కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమన్నారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉందన్నారు.
 
అందువల్ల ఇక్కడ కర్నాటక సీన్ రిపీట్ కానుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, వారంతా అదును కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు టీడీపీ శ్రేణులను వేధించడం తప్ప ఈ ప్రభుత్వ మరేం చేయడం లేదని ఎద్దేవా చేశారు. 
 
సోమవారం టెక్కలి టీడీపీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. టీడీపీ శ్రేణులను వేధించి కేసులు పెట్టడం మినహా మరేమీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలందరూ సైనికుల్లో పని చేయాలని ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు విశ్రమించవద్దని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments