ఈశాన్య చైనాలోని రెస్టారెంట్‌ భారీ పేలుడు : ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (13:20 IST)
ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్‌లో గల రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్‌ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్‌ భవనం కుప్పకూలిపోయింది. 33 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాలను తొలగిస్తున్నారు. 
 
అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్‌ చేసిన వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. దీనితో పాటు సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments