Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగిన అశ్వారాపుపేట ఎస్ఐ మృతి.. కులం పేరుతో వేధింపులే..?

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (10:52 IST)
Police
పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను (38) మృతి చెందారు. పోలీస్ ఉన్నధికారులు, కిందిస్థాయి సిబ్బంది వేధింపులు, కులవివక్ష వేధింపులను భరించలేని శ్రీరాములు జూన్ 30వ తేదీన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
ఆ సమయంలో ఆయనను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీరాములు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
కాగా, తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ఉన్నతాధికారులో కారణమని పేర్కొంటూ ఆయన భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగురాహులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments