Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు లొంగుబాటు... ఇటు బెయిల్ : అసదుద్దీన్ పవర్ ఇదీ!

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (15:29 IST)
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పురానాపూల్ డివిజన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, షబ్బీర్ అలీపై ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారని కేసు నమోదైంది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం సౌత్ జోన్ డీసీసీ ఎదుట అసదుద్దీన్ లొంగిపోయారు. అసదుద్దీన్ వెంట ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి తీవ్రపరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు తగుజాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఒవైసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన ఒవైసీనీ అటునుండి నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అసదుద్దీన్‌ అభ్యర్థన మేరకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments