నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు

కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (08:56 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశానని తెలిపారు. తన పోరాటం ఆగదని.. న్యాయం కోసం పోరాడితే తనపై ఎదురుదాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఆనాడు హైదరాబాదును డెవలప్ చేశానని.. ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సి వుందని చెప్పారు. ఓ పత్రిక తనను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కు లాగుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, శుక్రవారం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. 
 
వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్‌పై వెళ్లి బాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments