Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (19:39 IST)
పట్టణ ప్రాంతాల్లో 45 ఏళ్లు దాటినవారికి కోవిడ్‌-19 వాక్సినేషన్‌ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా నిర్వహించటంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ భారత్‌పేట, కుందలరోడ్డులోని వార్డు సచివాలయాలను పరిశీలించారు.

భారత్‌పేటలోని 140 వార్డు సచివాలయం, కమ్యూనిటీ సెంటరులో, కుందుల రోడ్డులోని 117వ వార్డు సచివాలయం వద్ద వాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లపై సంయుక్త కలెక్టర్లు పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధతో చర్చించారు.

వైద్యారోగ్యశాఖ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాక్సిన్‌ ఇచ్చే రూం, అబ్జర్వేషన్‌ రూంలను ఏర్పాటు చేయాలని, వాక్సిన్‌ తీసుకోవటానికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ కావటి శివనాగమనోహర్‌ నాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌, ఇన్‌చార్జి ఆర్‌డీవో డేవిడ్‌రాజ్‌, జిఎంసి అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, తహశీల్దార్‌ తాతా మోహనరావు, డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments