ఆర్మీ జవాన్ మృతి.. గ్రామంలో విషాద ఛాయలు

Webdunia
బుధవారం, 10 జులై 2019 (17:12 IST)
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని అశోక్ కుమార్ జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీలో విధులు నిర్వహిస్తూ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకు విధి నిర్వహణలో భాగంగా గత రెండు రోజుల క్రిందట అశోక్ తెల్లవారుజామున ఫస్ట్ టర్మ్ డ్యూటీ ముగించుకొని సెకండ్ టర్మ్ డ్యూటీకి వెళ్లే ప్రయత్నంలో తన తుపాకీ మిస్ ఫైర్ అయి మెడకు కింద భాగాన బులెట్ దూసుకొని వెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. 
 
అయితే అశోక్ చిన్నప్పటి నుండి దేశ సేవ చేయాలని చాలా ఆకాంక్షతో ఉండే వాడని తన తండ్రి కూడా ఆర్మీలో విధులు నిర్వహించి రిటైడ్ ఐయ్యడాని. తన తండ్రి ప్రోత్సాహంతోనే దేశ సేవకై రెండు సంవత్సరాల క్రితం ఆర్మీలో జాయిన్ ఐయ్యడాని అశోక్‌కి ఇంకా పెళ్లి కూడా కాలేదని ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని అశోక్ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అశోక్ పార్థివదేహం బుధవారం ఉదయం 7:30 నిమిషాలకు తన స్వగ్రామం అర్దవీడు మండలం పాపినేనిపల్లెకు చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments