Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. ఏంటది?

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (17:46 IST)
దీపావళి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఏపీలోని పర్యాటకులకు ఇది ఎంతో మంచి శుభవార్త. రాష్ట్రంలో ఉన్న నదుల్లో బోటు షికారుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.
 
ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన పర్యాటకం తిరిగి తెరుచుకుంటున్నాయి. 
 
బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments