Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (22:53 IST)
ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ కారణంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మరికొన్ని చోట్ల చెదురుముదురుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఏపీఎస్డీఎంఏ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడరాదని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయక  చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రఖర్  జైన్ భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments