ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (21:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు వాపోయారు. పైగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
పరీక్ష తేదీ ప్రకటించినప్పటికీ నుంచి పరీక్ష నిర్వహించే తేదీ మధ్య కనీసం 90 రోజుల పాటు సమయం ఉండాలి. అయితే, ఈసారి ఆ సమయం 60 రోజులే ఉండటంతో పరీక్షకు సన్నద్ధం కాలేమని గ్రూపు-2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధను కలిసి పరీక్షల నిర్వహణ తేదీని మార్చాలని, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఉత్తరాంధ్రకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి ఈ పరీక్షలను మరికొన్ని రోజుల పాటు అంటే అదనంగా 30 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అలాగే, పరువురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇదే తరహా విజ్ఞప్తులు చేశారు. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. కాగా, ఈ సారి గ్రూపు-2 ప్రిలిమ్స్‌కు 4.04 లక్షల మంది హాజరుకాగా, 92 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments