Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (21:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు వాపోయారు. పైగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
పరీక్ష తేదీ ప్రకటించినప్పటికీ నుంచి పరీక్ష నిర్వహించే తేదీ మధ్య కనీసం 90 రోజుల పాటు సమయం ఉండాలి. అయితే, ఈసారి ఆ సమయం 60 రోజులే ఉండటంతో పరీక్షకు సన్నద్ధం కాలేమని గ్రూపు-2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధను కలిసి పరీక్షల నిర్వహణ తేదీని మార్చాలని, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఉత్తరాంధ్రకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి ఈ పరీక్షలను మరికొన్ని రోజుల పాటు అంటే అదనంగా 30 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అలాగే, పరువురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇదే తరహా విజ్ఞప్తులు చేశారు. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. కాగా, ఈ సారి గ్రూపు-2 ప్రిలిమ్స్‌కు 4.04 లక్షల మంది హాజరుకాగా, 92 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments