Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు మోసకార్ అవార్డు ఇవ్వాలి : అచ్చెన్నాయుడు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవిధ్యభరితమైన నటుకు ఆస్కార్ కాకుండా మోసకార్ అనే అవార్డును ఇవ్వాలని టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ఆస్కార్ కాకుండా మోసకార్ అని ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం, వైసీపీ ఎంపీలు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై విచారం వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. 
 
సమస్యలపై గళమెత్తిన వారిని వైసీపీ ప్రభుత్వం అనిచివేస్తోందని ఆయన అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నిక్లలో ప్రజలే వైసీపీకి బుద్దిచెబుతారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments