Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు మోసకార్ అవార్డు ఇవ్వాలి : అచ్చెన్నాయుడు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైవిధ్యభరితమైన నటుకు ఆస్కార్ కాకుండా మోసకార్ అనే అవార్డును ఇవ్వాలని టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డుకు మించి నటించారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ఆస్కార్ కాకుండా మోసకార్ అని ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం, వైసీపీ ఎంపీలు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యపై విచారం వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. 
 
సమస్యలపై గళమెత్తిన వారిని వైసీపీ ప్రభుత్వం అనిచివేస్తోందని ఆయన అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నిక్లలో ప్రజలే వైసీపీకి బుద్దిచెబుతారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments