Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించిన ఏపీ ప్ర‌భుత్వం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (14:00 IST)
అస‌మాన సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇతోధికంగా సాయ‌ప‌డింది. సిరివెన్నెల చికిత్స కోసం అయిన‌ ఆసుపత్రి ఖర్చులను  కిమ్స్ ఆసుప‌త్రి  యాజమాన్యానికి ఏపి ప్రభుత్వం చెల్లించింది.


సిరివెన్నెల ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న చేరిన నాలుగైదు రోజుల‌కు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయ‌న చికిత్స‌కు అయిన ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. అంతే కాదు, అంత వ‌ర‌కు అంత వ‌ర‌కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ స‌భ్యులు,  ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా సిరివెన్నెల కుటుంబానికి తిరిగి  ఇవ్వాలని ఆసుపత్రికి  ఏపి ప్రభుత్వం తెలిపింది. 
 
 
సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నివాళి అర్పించింది. ప్ర‌భుత్వం త‌రఫున ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ కి వెళ్ళి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులు అర్పించారు. ఆయ‌న భార్య‌ను, బంధువుల‌ను ఓదార్చారు. వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు. అక్క‌డే మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున నివాళులు తెలిపారు. ఇలా మాట‌ల‌తోనే గ‌డ‌ప‌కుండా, ఆయ‌న కుటుంబానికి మేలు క‌లిగేలా, ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించి అండ‌గా నిలిచారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments