Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించిన ఏపీ ప్ర‌భుత్వం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (14:00 IST)
అస‌మాన సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇతోధికంగా సాయ‌ప‌డింది. సిరివెన్నెల చికిత్స కోసం అయిన‌ ఆసుపత్రి ఖర్చులను  కిమ్స్ ఆసుప‌త్రి  యాజమాన్యానికి ఏపి ప్రభుత్వం చెల్లించింది.


సిరివెన్నెల ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న చేరిన నాలుగైదు రోజుల‌కు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయ‌న చికిత్స‌కు అయిన ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. అంతే కాదు, అంత వ‌ర‌కు అంత వ‌ర‌కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ స‌భ్యులు,  ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా సిరివెన్నెల కుటుంబానికి తిరిగి  ఇవ్వాలని ఆసుపత్రికి  ఏపి ప్రభుత్వం తెలిపింది. 
 
 
సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నివాళి అర్పించింది. ప్ర‌భుత్వం త‌రఫున ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ కి వెళ్ళి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులు అర్పించారు. ఆయ‌న భార్య‌ను, బంధువుల‌ను ఓదార్చారు. వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు. అక్క‌డే మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున నివాళులు తెలిపారు. ఇలా మాట‌ల‌తోనే గ‌డ‌ప‌కుండా, ఆయ‌న కుటుంబానికి మేలు క‌లిగేలా, ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించి అండ‌గా నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments