Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా.. ఛీ.. నీ బతుకు చెడా...: చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (10:21 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఘనత సాధించారు. సాక్షాత్ రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టేశారు. సచివాలయ భవనాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఏకంగా రూ.370 కోట్ల అప్పు తెచ్చారు. ఇది ఇపుడు ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేతిగా ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమన్నారు. 
 
'రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి.. లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన ఘనతను బాలయోగి సాధించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన అందించిన సేవలను... కోనసీమ అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments