చంద్రబాబు చేయలేడు, జనసేనానికి అదేంటో తెలియదు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:28 IST)
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి శంకర్ నారాయణ. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్న మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం చంద్రబాబునాయుడిది. పార్టీ పెట్టాడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థితో పాటు సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. వీరు కూడా వైసిపి ప్రభుత్వాన్ని విమర్సించడమా. హాస్యస్పదంగా ఉందన్నారు మంత్రి శంకర్ నారాయణ.
 
ఎపిలో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగబోతోందని.. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని.. అందుకే 2,205కోట్ల రూపాయలను టెండర్లు పిలిచామని.. త్వరలో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్ల రూపురేఖలే మార్చేస్తామన్నారు. 
 
రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ ఏం తెలుసునని.. కనీస అవగాహన ఎందులోను లేని వ్యక్తి జనసేనాని అంటూ మండిపడ్డారు. ఇక చంద్రబాబు తన హయాంలో రోడ్ల గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. రోడ్ల పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంటే టిడిపి హయాంలో పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments