Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ స్థాయిలో గంజాయి దహనం: దేశంలోనే తొలిసారి..! (video)

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (14:00 IST)
ఏపీలో భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ ఆపరేషన్‌లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు.. సరిహద్దు రాష్ట్రాల సహకారంతో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 
 
గిరిజన  గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై  గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు చేసి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అలాగే గంజాయి సాగు చేయకుండా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించారు.
 
అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో పట్టుబడిన రెండు లక్షల కిలోల గంజాయిని శనివారం నాడు దహనం చేయనుంది. 
 
ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ గంజాయి దహనం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఓ ఈవెంట్‌లా నిర్వహించబోతోంది. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వాడుతోంది.భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments