Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (09:31 IST)
గత దశాబ్దకాలంగా మాచర్లలో అరాచకాలకు పాల్పడుతూ, ప్రజలను వేధిస్తూ వచ్చిన పిన్నెల్లి సోదరులపై పోలీసులు కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఇందులోభాగంగా, వారిపై తొలిసారి రౌడీషీట్‌ను తెరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించాడు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తపై కూడా దాడి చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైవుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ను తెరిచారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 
 
ఏపీలో జరిగిన పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదుకాగా, ప్రస్తుతం బెయిలుపై బయటవున్నారు. తాజాగా పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments