Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో కానిస్టేబుల్ భర్తీ ప్రిలిమినరీ పరీక్ష

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరుగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికో 997 కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాల్సివుంది. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. 
 
పరీక్షా హాలులోకి ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, రికార్డింగ్ పరికరాలు, క్యాలిక్యులేటర్, పర్సు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్ టిక్కెట్, బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకుని రావాలని సూచించింది. అలాగే, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటివివి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెటం తీసుకుని రావాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments