Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (18:16 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి పెట్టిన మిస్సింగ్ కేసును మూడు రోజుల్లోనే పరిష్కరించారు. బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసులో ముగ్గురుని అరెస్టు చేశారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో ఏర్పడిన వివాదం కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు. 
 
చిన్నారి బాలిక తండ్రి.. రేష్మ అనే మహిళకు రూ.3 లక్షల అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో తిట్టడంతో పాటు బెదిరించాడు. కోర్టుకు లాగుతానని హెచ్చరించాడు. దాంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. 
 
అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి, కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. 
 
కాగా, ఈ హత్య కేసుపై జిల్లా కలెక్టర్ సుమీత్ స్పందిస్తూ, కొన్ని చానళ్లు మాత్రం బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. అలాగే, హో మంత్రి అనిత కూడా మాట్లాడుతూ, బాలికపై అత్యాచారం జరగలేదని చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments