Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త ఎత్తేకొద్దీ కరెన్సీ నోట్ల కట్టలు ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చెత్త కుండీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 
 
తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఉండవల్లి సెంటరులోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. 
 
ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. 
 
కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments