Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... కోడ్ దెబ్బకు 'కరివేపాకు'లా మారిన మంత్రి

ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... కోడ్ దెబ్బకు  కరివేపాకు లా మారిన మంత్రి
Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (20:28 IST)
ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 23 రోజులు ఆగాలి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలనుకున్నారు వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రిగారు సచివాలయానికి వచ్చి అధికారులకు కబురు పంపినా ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... ఎవ్వరూ సోమిరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. 
 
ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ అలాగే ఎదురుచూపులు చూశారు. అధికారులు ఎవరయినా వస్తే వారితో సమీక్ష చేద్దామని. మంత్రిగారు కబురు పంపిన నేపధ్యంలో సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించారట. ఎన్నికల కోడ్ అమల్లో వున్నది కనుక సమీక్షలకి నో ఛాన్స్ అనేసరికి వారు కాస్తా సైలెంట్ అయిపోయారట.
 
ప్రజలు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే వాటిపై చర్చించడానికి అధికారులు ఎందుకు రారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు తొక్కారట. ఐనప్పటికీ కోడ్ దెబ్బకు అధికారులు ఎవ్వరూ రాలేదు మరి. ఈ పరిస్థితి అంతా చూసినవారు... కోడ్ దెబ్బకు మంత్రిగారిని కరివేపాకులా తీసిపారేశారే అని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments