Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఏపీ అధికారులు నిమగ్నం

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (21:50 IST)
గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన మొత్తం 1,148 మందిలో ఇప్పటి వరకూ 1,040 మంది జాడ కనుగొన్నామని, ఇందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని, మరో 90 మంది జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్వె ల్లడించారు. 

ఇందులో 982 మందిని క్వారంటైన్లో వుంచామని, వీరిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు కన్పించటంతో తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలున్నాయో లేదో పరిశీలించేందుకు వారి రక్త నమూనాలను పుణేలోని ఎన్ఐవి ల్యాబ్ కు పంపామని  ప్రకటనలో వివరించారు.

దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు సోమవారం నుండి కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను ఐదు ప్రాంతాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకు సంబంధించిన వెబ్ ఆధారిత సాఫ్ట్ వేర్ కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు జిల్లాల్లో వ్యాక్సిన్ ట్రయల్ రన్ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తాము కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాటంనేని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments