Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనకు ఆకర్షితులవుతున్నారు : మంత్రి నారాయణ

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (17:01 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలనకు అనేక మంది ఆకర్షితులవుతూ ఆ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఛైర్‌పర్సన్‌తో పాటు మరో ఏడుగురు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. 
 
టీడీపీ విధానాలు నచ్చి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధి కోసం తాము తెదేపాలో చేరామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. అందరికి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించడంతో అభివృద్ధి జరగలేదని మంత్రి నారాయణ అన్నారు. 
 
నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని నగర పంచాయతీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.42 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే టీడీపీలో చేరుతున్నారన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను జగన్‌ రాబట్టలేకపోయారని నారాయణ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments