Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి జోగి రమేష్‌కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:21 IST)
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్‌కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మంత్రి జోగి రమేష్‍‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాక్షాత్తూ సొంత బామ్మర్దులు, బంధువులు వైకాపాకు టాటా చెప్పేశారు. వారు సైకిల్ ఎక్కేశారు. 
 
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి జోగి రమేష్‌కు షాకిస్తూ, ఆయన సొంత బామ్మర్దులు పామర్తి దుర్గా ప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వర రావులు టీడీపీ చేరారు. వీరితో పాటు జోగి రమేశ్‌‍కు చెందిన 40 మంది బంధువర్గం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. అయితే, ఈ అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments