Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్ పక్కకెళ్లు అంటూ డీఎస్పీపై విరుచుకుపడిన మంత్రి జోగి

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (16:48 IST)
ఏపీలో మంత్రులు అధికారమదంతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కింది స్థాయిలో వైకాపా నేతలు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. 'ఏయ్.. పక్కకెళ్లు' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఏపీ మంత్రి రోజా శుక్రవారం మచిలీపట్నం పర్యటనకు వచ్చారు. ఆమెకు మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఆ సమయంలో పలువురు నాయకులు రోజాకు పుష్పగుచ్ఛం ఇచేందుకు పోటీపడ్డారు. ఒక్కో నేతలను మంత్రి రోజాకు మాజీ మంత్రి పేర్ని నాని పరిచయం చేశారు.
 
ఆ సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చారు. అయితే, ఎస్పీ అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలంటూ డీఎస్పీ మాన్షూ బాష కోరారు. డీఎస్పీ చేయి తనకు తగలడంతో పక్కకు వెళ్లు అంటూ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ చీదరించుకుంటూ మండిపడ్డారు. డీఎస్పీ వైపు కోపంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments