Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదు : మంత్రి బొత్స

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్రంలోని అనేక పాఠశాలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలను తీసుకుని తమకు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పాఠశాలలను మూసివేయలేదని.. అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా తాను బాధ్యత వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్‌ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. 
 
విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపడుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments