Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగోడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనాలి : మంత్రి అవంతి శ్రీనివాస్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (11:16 IST)
తెలుగోడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనాలి అంటూ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ చర్యను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇదే అంశంపై వైజాగ్‌లో ఉద్యమం కూడా ఊపందుకుంది. 
 
దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ, బీజేపీ కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇపుడు తెలుగు వాడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనే విధాంగా మన పోరాటం చూపించాలన్నారు. 
 
అంతేకాకుండా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఇందిరమ్మను సైతం ప్రజలు గద్దె దించారని.. బీజేపీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఏపీకి సమస్యలు తిష్ట వేశాయన్నారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వేజోన్ లేదు, బడ్జెట్‌లో నిధులు లేవని మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇపుడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్రం కొత్త పాట అందుకుందన్నారు. కేంద్రంలోని పాలకులు ఉత్తరాది రాష్ట్రలను పెద్ద చూపు దక్షణాది రాష్ట్రలను చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ఏపీ ప్రజల ఉసురు తగిలి వాళ్ళు ఎవ్వరూ బాగు పడలేదన్నారు. 
 
అదేసమయంలో పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తిరుపతిలో ఉప ఎన్నికల మీద కాకుండా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాలని మంత్రి హితవుపలికారు. ప్రైవేటీకరణ చేస్తామని 22 మంది ఎంపీలకు కేంద్రం ఒక్క మాట చెప్పలేదన్నారు. కొంత మంది రాజీనామాలు చేసారని.. దాని వల్ల ఫలితం ఉండదు పోరాటంతోనే ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments