Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల ప్రాణాలపై ఏపీ రాష్ట్ర‌ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డికి ప్రేమో...!!

Webdunia
గురువారం, 20 మే 2021 (17:38 IST)
ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఎవరూ చనిపోలేదు. లక్షల రూపాయిలు మందుకి వసూలు చేయడంలేదు. అయినా సరే లోకాయుక్త జస్టీస్ లక్ష్మణరెడ్డి ప్రజాక్షేమం కోరో లేక వేరే కారణాలో ఎదైతేనేమి ఆపత్కాలంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ వచ్చిన కరోనా ఆయుర్వేద మందును పంపిణీ ఆపివేయించారు. 
 
నిజానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో రాష్ట్రంలో గతంలో ఉన్న బ్రాండ్లు కనుమరుగై నాసిరకం మధ్యం అధిక ధరలకి ప్రభుత్వం అమ్ముతుంది. దీని మీద లక్ష్మణరెడ్డి స్పందించలేదు. అన్ని బ్రాండులు అమ్మాలని ఆదేశాలు ఇవ్వలేదు. రేట్లు తగ్గించాలని ఆదేశాలు ఇవ్వలేదు. 
 
జగన్ సిఎం అయిన నాటి నుండి అత్యంత ఖరీదైన వ్యవహారం అయిపోయింది. 6 నెలలు ఇసుక సరఫరా ఆపేశారు. ఏనాడు లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
కరోనా రెండో దశలో ఆక్సిజన్ అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి రుయాలో పదుల సంఖ్యలో చనిపోయారు. లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కేసు.. లక్ష్మణరెడ్డి స్పందించలేదు. 
 
కానీ, 
 
ప్రజలకి ఉపయోగపడే మందు మీద ఆగమేఘాల మీద స్పందించారు. అది కూడా సుమొటోగా స్వీకరించారు. ఆ తర్వాత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న కరోనా మందు పంపిణీని నిలివేయించిన ఘనత లోకాయుక్త లక్ష్మణ రెడ్డికే దక్కుతుందని విపక్షనేతలు, కరోనా రోగులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments